లోకల్ బాడీ ఎన్నికలు.. ఏకగ్రీవాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఈసీ

-

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రాష్ట్రంలో ఏకగ్రీవాలు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు
సమాచారం.

అందుకు సంబంధించి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విధానం హరియాణా, మహారాష్ట్రలో అమల్లో ఉన్నది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే, పార్టీ ఓకే చెప్పినా ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా అనేది ఆసక్తిగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version