వైసిపి కబ్జాకోరులు…విశాఖపట్నాన్ని.. విషాదపట్నంగా మార్చేస్తున్నారు : నారా లోకేష్

-

విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసిపి కబ్జాకోరులు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కన్నుపడిన ప్రతిగజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసిపి కబ్జాపర్వంలో సరికొత్త కోణం అని మండిపడ్డారు.

స్థలం కబ్జా చెయ్యడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో వైసిపి ల్యాండ్ మాఫియా అరాచకాలకు అద్దం పడుతుందని అగ్రహించారు. ప్రజల్ని కాపాడే పోలీసులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి ? అని నిలదీశారు. విశాఖపట్నంలో వైసీపీ కబ్జాల పర్వానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. బాధితులంతా బయటకు రావాలని.. వైసీపీ కబ్జా కోరల నుండి విశాఖని రక్షించుకుందాం.. మీకు అండగా టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీకి తగిన బుద్ది చెప్పాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version