కారు మీద బోల్తాపడిన లారీ ట్రాలీ.. ఆరుగురు దుర్మరణం

-

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రన్నింగ్ కారుపై లారీ ట్రాలీ బోల్తా పడటంతో నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. బికనీర్‌లోని దేశ్ఋనోక్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహిళ సహా ఐదుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా.. దేశ్‌నోక్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పక్కనే బూడిద లోడ్‌తో వెళుతున్న ఓ లారీ ట్రాలీ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి కారుపై పడింది. ఒక క్రేన్,మూడు జేసీబీల సహాయంతో ట్రాలీని తొలగించగా.. కారు మొత్తం ట్రాలీలోని బూడిదతో నిండిపోయింది. కారులోని వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news