తొలి చూపులోనే ప్రేమ అంటూ.. లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు..!!

-

లావణ్య త్రిపాఠి.. మొదటిసారి అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. గతంలో అందాల రాక్షసి సినిమా తర్వాత ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. కానీ స్టార్ స్టేటస్ ని అయితే అందుకోలేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై కూడా ఎప్పుడూ ఆమె పరోక్షంగా స్పందించిందే కానీ నేరుగా మాట్లాడలేదు. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తొలి ప్రేమ గురించి వెల్లడించింది..

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు అని.. అబ్బాయిని ప్రేమించాలా.. వద్దా.. అనేది అతడితో మాట్లాడి.. కొంత సమయం గడిపితే కానీ చెప్పలేనని, మాట్లాడటం చాలా ముఖ్యమంటూ చెప్పుకొచ్చింది లావణ్య.. అంతేకాదు వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నాననే ప్రచారంపై కూడా ఆమె మాట్లాడుతూ మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించాను కాబట్టి బహుశా వార్తలు అలా వార్తలు ప్రచారం అయి ఉంటాయి. ఇక పెళ్లిపై తనకు నమ్మకం లేదు అని ప్రస్తుతం సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాను ఇంకా లవ్ లో పడకపోవడానికి కూడా కారణం కూడా తెలియజేసింది . ఇప్పటివరకు తనకు తన మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరకలేదు అని, ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అడగగా.. నిహారిక , సందీప్ కిషన్, రీతూ వర్మ, అల్లు శిరీష్ ల పేర్లు చెప్పుకొచ్చింది. ఇక అందులో చాలామంది ఫిల్మ్ ఆర్టిస్ట్ లు ఉన్నట్లు కూడా తెలిపింది.

ఇక అందాల రాక్షసి సినిమా చేస్తున్న సమయంలో తాను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలోనే కొనసాగుతానని అనుకోలేదు అని, కొన్ని సినిమాలు చేశాక హిందీకి వెళ్లాలని అనుకున్నానని, కానీ ఇప్పుడు హైదరాబాదు తనకు రెండో ఇల్లు అయిందంటూ చెప్పుకొచ్చింది. ఇక అలా తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version