టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ జెయింట్స్

-

ఐపీఎల్ 2023-సీజన్ లో ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి మరియు లక్నో సూపర్ జెయింట్స్ కి జరగబోయే మ్యాచ్ కొరకు రెండు జట్లు రెడీ గా ఉన్నాయి. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ తీసుకుంది. ఈ రెండు జట్లలోనూ ఆల్ రౌండర్లు చాలా పుష్కలంగా ఉండడంతో మ్యాచ్ లో ఆసక్తికర పోరు జరగడం ఖాయం అని చెప్పుకోవొచ్చు.


రాయల్ చల్లేంగెర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, నికోలాస్ పూరన్, మార్కస్ స్టొయినిస్ వంటి మంచి జోరు కొనసాగించే ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, డేవిడ్ విలీ, వేన్ పార్నెల్ బెంగళూరు బౌలింగ్ లో తమ ప్రతాపం చూపనున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ టీం లో మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, జయదేవ్ ఉనద్కట్ వంటి స్టార్ పేసర్లు మరియు అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ వంటి ప్రతిభావంతులైన లెగ్ స్పిన్నర్లు కూడా ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే బెంగళూరు కంటే సూపర్ జెయింట్స్ చాలా ఊపులో కనిపిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version