ఉత్కంఠ భరిత పోరులో ఢిల్లీ ఓటమి

-

అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. అక్షర్‌ పటేల్‌ అఖరి వరకు పోరాడినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

ఢిల్లీ బ్యాటర్లలో పంత్‌(44), అక్షర్‌ పటేల్‌(42), మిచెల్‌ మార్ష్‌(37) పరుగులతో టాప్‌ స్కోరర్‌లగా నిలిచారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చమీరా, గౌతమ్‌,బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ల‍క్నో బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 77 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీపక్‌ హుడా 52 పరుగులతో రాణించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version