ఎమ్మెల్యే మద్దాలి గిరి ఇంట తీవ్ర విషాదం !

-

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మద్దాలి సుబ్బారావు గుంటూరు రమేష్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి పొద్దుపోయాక తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 సంవత్సరాలని తెలుస్తోంది.

మరి కాసేపట్లో గుంటూరు ఆర్. అగ్రహారం, లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర ఉన్న ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ స్వగృహం నుండి ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇక ఆయన అంత్యక్రియలు కూడా గుంటూరులోనే నివహించనున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గిరిధర్ ఇప్పుడు వైసీపీకి జై కొట్టారు. కండువా కప్పుకోకుండానే ఆయన వైసీపీకి మద్దతు తెలియచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈయన వైసీపీకి చెందిన ఏసురత్నం మీద పదిహేడు వేల మెజారిటీతో గెలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version