బ్రేకింగ్ : మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్

-

కరోనా వైరస్ కేసులు ఎవరినీ వదలడం లేదు. సామాన్యులు లేదు, సెలబ్రిటీలు లేరు అందరినీ ఒక చుట్టు చుట్టేస్తోంది. ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పక్కనే వెలంపల్లి ఉన్నట్టు తెలుస్తోంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఈనెల 25వ తేదీన విజయవాడ చేరుకున్నట్టు చెబుతున్నారు. ఆయన వచ్చినప్పటి నుండే స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ముందస్తు జాగ్రత్తతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు మంత్రి వెల్లంపల్లి. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే జగన్ సహా, తిరుమలలో మంత్రితో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు. మరి వీరంతా ముందస్తు జాగ్రత్తతో పరీక్షలు చేయించుకుంటారెమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version