రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేశాడు : సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

-

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అన్న సీఎం కేసీఆర్.. తాగుబోతుల తెలంగాణ చేశాడ‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొమ‌టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్ర అభివృద్ధిని మ‌రిచి.. మ‌ద్యం, బెల్ట్ దుకాణాల‌తో రాష్ట్రాన్ని నింపేశార‌ని విమ‌ర్శించారు. కాగ కేసీఆర్ నియోజ‌క వ‌ర్గం అభివృద్ధి చెందితే.. తెలంగాణ అభివృద్ధి చెందిన‌ట్టు కాద‌ని అన్నారు. మునుగోడు నియోజ‌క వ‌ర్గాన్ని కూడా అభివృద్ధి చేయాల‌ని డిమాండ్ చేశారు.

అలాగే త‌మ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జ‌గ‌దీశ్ రెడ్డికి ద‌మ్ముంటే.. మునుగుడు నియ‌జ‌క వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాల‌ని స‌వాల్ విసిరారు. అలాగే రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ లేకుండా.. అందిరీనీ టీఆర్ఎస్ లోకి లాక్కుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఇత‌ర పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వ‌కుండా అభివృద్ధికి అడ్డు ప‌డుతున్నార‌ని ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు చారితాత్మ‌క తీర్పు ఇస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version