పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉంటే.. 100 సీట్లు మావే !

-

ఎన్నికలయ్యే వరకు రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలి… ఆయన ఉంటే మేము 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న అమెరికా పర్యటనలో భాగంగా ఉచిత కరెంటు పై వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాడు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో… భారత రాష్ట్ర సమితి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఉంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. ఎక్కువ మంది జనాలు వస్తే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని… అలా మాట్లాడటం వల్ల మా పార్టీకి చాలా లాభం చేకూరుతుందని తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డిని ఎన్నికల అయ్యే వరకు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. కాగా రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version