టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

-

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్. ఇటీవల ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి నేటి వరకు టీపీసీసీ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఆ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు మహేష్ గౌడ్. అక్కడి నుంచి గాంధీ భవన్ కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీతో భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ.. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. తన నియమాకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏఐసీసీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version