60 ఏళ్ల వితంతువుపై ఆత్యాచారం.. పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ఆందోళన..!

-

వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ముందు పొరుకలపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే పొరుకపల్లి గ్రామానికి చెందిన 60 ఏళ్ల వితంతువు మహిళ పైనా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్యాచారం చేశాడని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. పొరుకపల్లి లోని మాధం శివకుమార్ (25) అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టుగా పోలీస్ స్టేషన్ లో సదరు 60 ఏళ్ల వితంతువు ఫిర్యాదు చేసింది.

అయితే ఫిర్యాదు చేసి రెండు రోజులు అవుతున్నా పోలీసులు మాత్రం ఏం పట్టించుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డు పై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే గ్రామస్థున్న ఆందోళన నేపథ్యంలో సంబాబుదిధ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కూడా చేపట్టినట్టు తెలిపారు. ఇక అనంతరం ఎస్పీ ఆదేశం మేరకు నిందితున్ని అరెస్ట్ చేస్తామని సీఐ తెలపడంతో గ్రామస్తులు ఆందోళనా విరమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version