మహేష్ ఎక్కువగా ఇష్టపడి తినే ఫుడ్ ఇదేనట..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ తన స్టామినా ఏంటో నిరూపించుకుంటూ ఉన్నాడు. కృష్ణ కుమారుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. తన పర్సనాలిటీ, బాడీ మెయింటెనెన్స్ విషయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. సినిమాలలో చేస్తూనే పలు యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు మహేష్ బాబు .

ఇక పలు రకాల వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టి మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణాన్ని కూడా నిర్మించారు. ఇక తన అందం ఏ మాత్రం తగ్గిపోకుండా ఉండేందుకు మహేష్ బాబు తినే ఆహారం విషయంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు తమ అమ్మమ్మ చేతి వంట తినడం వల్లే .. ఇలా అందంగా ఉన్నానని పలుసార్లు తెలియజేశారు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా మహేష్ బాబే ఒకానొక సందర్భంలో తెలియజేయడం జరిగింది. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబు జూనియర్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగానే మహేష్ బాబు కి ఇష్టమైన ఆహారం ఏంటి అనే ప్రశ్న అడగగా.. తన అమ్మమ్మ చేతి వంట అని తెలియజేశారు. ఆమె మరణించడంతో ఆ వంట చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. వాటితోపాటుగా నాటుకోడి పులుసు ,చేపల ఫ్రై, లేకుంటే పప్పు , చపాతి అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అన్నిటికంటే తన పిల్లలు అంటే చాలా ఇష్టమని మహేష్ బాబు తెలియజేశారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రం సక్సెస్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version