వీడిన బాలుర మిస్సింగ్ మిస్టరీ.. లైంగిక దాడి అనంతరం దారుణంగా ?

-

గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు మైనర్ బాలుర మర్డర్, మిస్సింగ్ కేసులలో మిస్టరీ వీడింది. కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో బాలుడు ఆ ఇద్దరి మీద లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకుని బాలురను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలుడి వయసు 19 ఏళ్ళు.  ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. అందులో ఓ బాలుడు అసలు కనపడక పోయినా, మరో బాలుడు అదృశ్యమైన రెండో రోజే మృతదేహమై కనిపించాడు.

 

దీంతో ఈ రెండు కేసులను సవాల్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించి నిందితుడిని పట్టుకున్నారు. మెల్లంపూడి గ్రామంలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న కుర్ర భార్గవ తేజ (6) అదృశ్యం కాగా.. అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు హంగామా చేసిన, అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపీ అనే 19 ఏళ్ల యువకుడిపై పోలీసులకు అనుమానం రావడంతో అతణ్ణి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను నిజం ఒప్పుకున్నాడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version