రూ.5 కోట్లు ఇస్తే ప్ర‌ధాని మోదీని హ‌త్య చేస్తా.. ఎఫ్‌బీలో మెసేజ్‌ను పోస్ట్ చేసిన వ్య‌క్తి అరెస్టు..

-

పుదుచ్చేరికి చెందిన ఓ 43 ఏళ్ల‌ వ్య‌క్తి ప్ర‌ధాని మోదీని హ‌త్య చేస్తాన‌ని, అందుకు త‌నకు రూ.5 కోట్లు ఇవ్వాల‌ని ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. ఎవ‌రు రూ.5 కోట్లు ఇచ్చినా హ‌త్య చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని మెసేజ్ పెట్టాడు. కాగా ఆ పోస్టు వైర‌ల్ అయింది. ఓ కార్ డ్రైవ‌ర్ ఆ మెసేజ్‌ను గుర్తించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

పుదుచ్చేరికి చెందిన తంగ‌దురై అనే ఓ కార్ డ్రైవ‌ర్ ఓ వ్య‌క్తి పెట్టిన ఫేస్‌బుక్ మెసేజ్‌ను గ‌మ‌నించాడు. అందులో స‌త్య స‌త్య అని ఉంది. రూ.5 కోట్లు ఇస్తే మోదీని హ‌త్య చేసేందుకు సిద్ధ‌మ‌ని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో పోలీసులు ఆ మెసేజ్ పెట్టిన యూజ‌ర్ అకౌంట్‌ను ట్రేస్ చేశారు.

కాగా ఆ మెసేజ్ పెట్టిన వ్య‌క్తిని ఆర్య‌న్‌కుప్ప‌మ్ గ్రామానికి చెందిన వ్యాపార‌వేత్త స‌త్యానందంగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. అత‌నిపై 505(1), 505(2) సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. అయితే అత‌ను గ‌తంలోనూ ఇలాగే ప‌లుమార్లు కొంద‌రు నాయ‌కుల‌పై సంచ‌ల‌న మెసేజ్‌లు పెట్టాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. స‌మాజంలో హింస‌ను ప్రేరేపించే విధంగా కూడా అత‌ను మెసేజ్ లు పెడుతుంటాడ‌ని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version