సికింద్రాబాద్ లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

-

ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఓ వ్యక్తి దానికింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వైపు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తోంది. రైలు చర్లపల్లి-ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి (35) దాని కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రైలుకు ఎదురుగా వెళ్లి రెండు చేతులను జోడించి దండం పెడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత ఆ వ్యక్తి పట్టాలపైకి చేరుకోవడాన్ని రైలు ఇంజిన్‌లో ఉన్న లోకో పైలెట్‌ సురేశ్‌బాబు గుర్తించారు. హారన్‌ కొట్టినప్పటికీ ఆ వ్యక్తి పక్కకు వెళ్లలేదు.

రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద చిరునామాకు సంబంధించిన ఎలాంటి గుర్తింపు వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు పసుపు రంగు షర్ట్‌, నలుపు ప్యాంటు ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించేందుకు అవకాశముంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version