హార్ట్ ఎటాక్ : వరదలో నాలుగు కిలోమీటర్లు మంచం మీదే.. !

-

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరద నీరు నిండు ప్రాణాన్ని తీసేసింది. వివరాల్లోకి వెళితే చాగలమర్రి మండలం బ్రాహ్మణ పల్లిలో దారుణం జరిగింది. థామస్ అనే వ్యక్తికి గుండెపోటుతో మరణించాడు. నిజానికి అతనికి గుండెపోటు రావడంతో వెంటనే 108 కి సమాచారం అందించారు. కానీ ఊరి చుట్టూ వరద నీరు ఉండటంతో గ్రామంలోకి 108 వాహనం రాలేక పోయింది.

heart attack pain in fingers

పక్కన ఊరు అయిన గొట్లూరుకు వచ్చిన 108 వాహనం సిబ్బంది, అక్కడి దాకా తీసుకు రావాలని థామస్ కుటుంబ సభ్యుల ను కోరారు. థామస్ ను మంచంపై పడుకోబెట్టి నాలుగు కిలోమీటర్లు వరద నీటిలో ప్రయాణం చేసి మరీ కొడుకులు ఆయన్ని 108 వాహనం వద్దకు తీసుకు వచ్చారు. అయితే దురృష్టవశాత్తూ 108 వాహనం ఎక్కిస్తుందగా థామస్ కన్నుమూశాడు. దీంతో థామస్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version