సుశాంత్‌-రియా ఇష్యూపై మంచు ల‌క్ష్మి స్పంద‌న‌ ఇదే..

-

బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న మ‌ర‌ణానికి గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని దోషిగా చూపిస్తూ ప‌లువురు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రియా మీడియా ముందుకు వ‌చ్చి తనతో పాటు సుశాంత్ కి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత రియాకి కాస్త మ‌ద్దతు పెర‌గ‌డంతో పాటు #JusticeForRheaChakraborty అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై మోహ‌న్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మీ కూడా స్పందించారు. త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ #JusticeForSushanthSinghRajput , #JusticeForRheaChakraborty అంటూ పోస్ట్ పెట్టారు.

*రియా ఇంట‌ర్వ్యూ నేను చూశాను. దీనిపై స్పందించాలా వ‌ద్దా అనే దాని గురించి చాలా ఆలోచించా. ఈ విష‌యంలో ఒక అమ్మాయిని మీడియా రాక్ష‌సిగా చేయ‌డం బాధగా ఉంది. నాకు నిజం తెలియ‌దు. స‌త్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం నిజాయితీగా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని భావిస్తున్నాను. న్యాయ వ్యవస్థపై, సుశాంత్ కు న్యాయం చేయడంలో పాలుపంచుకున్న అన్ని ఏజెన్సీలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం తెలియ‌కుండా ఓ వ్య‌క్తిని, ఆమె కుటుంబం మొత్తాన్ని కించ‌ప‌ర‌చ‌కుండా ఉండొచ్చు. మ‌న స్వ‌రం వినిపించాల్సి వ‌చ్చిన‌ప్పుడు హార్ట్‌ఫుల్‌గా మాట్లాడ‌క‌పోతే మ‌నం ఎలా ప్రామాణికం అవుతాము. నేను నా కొలీగ్ కి పూర్తి మ‌ద్ద‌తిస్తా* అంటూ ల‌క్ష్మీ త‌న పోస్ట్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version