రాజకీయాల్లోకి మంచు మనోజ్‌ ఫ్యామిలీ.. క్లారిటీ ఇచ్చేశాడు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సతీసమేతంగా వెళ్లారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో కలిసి వెళ్లి భేటీ అయ్యారు. అయితే.. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ముచ్చటించారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం తమ బాబు పుట్టిన రోజు ఉందని.. ఆశీస్సుల కోసం చంద్రబాబును కలిసినట్లు తెలిపారు.

తమ పెళ్లి తర్వాత చంద్రబాబును కలవడం కుదరలేదని.. అందుకుని తాజాగా కలిశామని చెప్పారు. ప్రస్తుతానికి చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశామని, రాజకీయ ప్రవేశంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. కాగా రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబును మంచు మనోజ్ ఫ్యామిలీ కలిసిందని ప్రచారం జరిగింది. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పడంతో ఆ ప్రచారానికి మంచు మనోజ్ చెక్ పెట్టినట్లైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version