మంత్రి రోజా: జాతరలో వేపాకు పట్టుకుని ఊగినట్టు ఊగుతున్నాడు…

-

ఈ రోజు తిరుపతి లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక రేంజ్ లో విమర్శలను ఎక్కు పెట్టారు. ఈమె మాట్లాడుతూ పవన్ ముందు నువ్వు ఎమ్మెల్యే గా గెలువు.. అది కూడా కాకుండా జాతరలో వేపాకులు పట్టుకుని ఊగినట్లు మాట్లాడడం ఏమిటి అంటూ రెచ్చిపోయి మాట్లాడింది. నువ్వు చెప్పినట్లు గోదావరి జిల్లాలలో 34 నియోజకవర్గాలలో గెలవడం కాదు, ఏమాత్రం దమ్మున్న రాష్ట్రము మొత్తం మీద ఉన్న 175 స్థానాలలో నీ పార్టీ సొంత అభ్యర్థులను 34 మందిని నిలబెట్టు అంటూ సవాలు విసిరింది.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని సభలను పెట్టినా 2024 లో జరగనున్న ఎన్నికలలో గెలిచేది వైసీపీ… సీఎం అయ్యేది జగనన్న అంటూ ఎంతో నమ్మకంగా చెప్పింది. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి.. అందుకే మళ్ళీ జగనన్నే సీఎం చేస్తారు అన్న ధీమాతో ఉన్నాం అంటూ మంత్రి రోజా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version