పవన్ “వారాహి” యాత్ర సక్సెస్: ఉండవల్లి అరుణ్ కుమార్

-

మాజీ కాంగ్రెస్ ఎంపీ మరియు అడ్వకేట్ అయిన రాజమండ్రి నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత రాజకీయాల గురించి మీదుగా అవగాహన ఉన్న వ్యక్తి. తాజాగా పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో చేసిన వారాహి యాత్ర గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈయన మాట్లాడుతూ మొన్ననే పవన్ చేసిన వారాహి యాత్ర ప్రజలలో మంచిగా దూసుకువెళ్లింది అన్నారు. పవన్ చేసిన ఈ యాత్ర సక్సెస్ అయిందని కంఫర్మ్ చేశాడు. తాను ఏమి చేస్తాడు అన్న విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పాడని పవన్ ను ఉద్దేశించి అన్నాడు ఉండవల్లి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అన్న విషయం తెలియదు అన్నారు.

అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చే ఉండవల్లి ఈసారి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ ఏమైనా జనసేన లోకి వెలుతారా అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కానీ ఉండవల్లికి రాజకీయాలు అంటేనే ఆసక్తి లేదని తేల్చి చెప్పేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version