కాంగ్రెస్‌కు మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

-

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇటీవలే శశిధర్ రెడ్డిని హస్తం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. చాలా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలతో సోనియా గాంధీకి లేఖ రాశానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు చాలా బాధగా ఉందని మర్రిశశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తు ఎంపికలో తన తండ్రి చెన్నారెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పారు. ఇన్నేళ్లు పార్టీతో తనకున్న అనుబంధాన్ని వదిలి వెళ్తున్నందుకు విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న ఆయన.. కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ కూడా చెప్పారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్‌..అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version