బెంగళూరు హైవేపై ప్రమాదం.. నమ్మశక్యం కానీ రీతిలో ఢీకొన్న వాహనాలు..!

-

బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో నమ్మశక్యం కానీ రీతిలో వాహనాలు ఒక్క దానిని మరొకటి ఢీకొన్నాయి. సినిమాల్లో చూసిన విధంగా వరుసగా బండ్లు గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసం అయ్యాయి. ఈ యాక్సిడెంట్ లో ఒకరు స్పాట్ లోనే మరణించగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హైవే దగ్గరలో ఉన్న హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించారు.

ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరు – క్రిష్ణగిరి మార్గం లోని హోసూరు సమీపంలో పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి. మొత్తం 15 వాహనాలు ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో బెంగళూరు – క్రిష్ణగిరి హైవేపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version