డ్రామాలో భాగమే.. ఇప్పుడెందుకు చంద్రబాబూ: మెరుగు నాగార్జున

-

ఏపీలోని రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక హోదా విషయం మీద పోరాటానికి ఢిల్లీ వెళ్లారు. దీని పై స్పందించిన ఏపీ మంత్రి మెరుగు నాగార్జున ఆమె మీద విమర్శలు చేశారు. షర్మిల ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అడిగే విషయము ని ఈ నాలుగున్నర ఏళ్లలో ఎందుకు మర్చిపోయిందని అన్నారు.

ఎవరు చెప్తే వెళ్లి అడుగుతుందని, ఎవరిని దూషించడానికి వెళ్లిందని అన్నారు. ఇవన్నీ కూడా టిడిపి అధినేత చంద్రబాబు ఆడే డ్రామా లో భాగమని అన్నారు ఎప్పుడో ఉద్యమం మొదలు పెట్టి ఉంటే బాగుండేదని ఇప్పుడు ఎందుకు చేస్తుందో ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుందో తనకే తెలియాలని అన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ఢిల్లీ వెళ్లి పలు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version