BREAKING : తిరుమలలో మంత్రి రోజాకు నిరసన సెగ

-

BREAKING : తిరుమలలో మంత్రి రోజాకు నిరసన సెగ తగిలింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. స్వామి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఆమెను జై అమరావతి అని నినాదాలు చేస్తూ శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని ఆమెకు వారు విజ్ఞప్తి చేయగా…. మంత్రి స్పందించకుండా ముందుకు సాగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Protest against Minister Roja in Tirumala

ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారికి భారీగానే ఆదాయం వస్తోంది. జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తాజాగా టీటీడీ నివేదిక విడుదల చేసింది. అలాగే…జనవరి నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.116.46 కోట్లుగా నమోదు అయినట్లు స్పష్టం చేసింది టీటీడీ పాలక మండలి. అలాగే… జనవరి నెలలో లడ్డూలు 1.03 కోట్లు విక్రయించారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 46.46 లక్షలుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version