నా పేరు వెనక ‘రెడ్డి’ చేర్చి రెడ్డిగా మార్చొద్దు : అమర్‌నాథ్‌

-

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో నెలకొల్పిన ఏటీజీ టైర్ల కంపెనీని ఈ నెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కంపెనీలో పర్యటించారు. తన పేరు వెనక ‘రెడ్డి’ చేర్చి తనను రెడ్డిగా మార్చొద్దని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కోరారు. కొందరు అవగాహన లేకుండా అలా పిలిచి తనను రెడ్డిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహ్వానం పలికే వారికి అవగాహన లేకపోవడం వల్ల తన పేరు వెనక రెడ్డి తగిలిస్తున్నారని అన్నారు.

తిరుపతిలోని అపాచీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈవో, జపాన్ ప్రతినిధులు అందరూ తనను అమర్‌నాథ్‌రెడ్డిగానే సంబోధించారని గుర్తు చేశారు. కాబట్టి టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version