Breaking : పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్‌కు నా సలహా ఇది : అంబటి రాంబాబు

-

ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా దూషణ చేశారని, ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య చూస్తే అతనిలో ఎంత ఫ్రస్టేషన్ ఉందో అర్ధం అవుతుందన్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వాలను కూల్చే అవకాశం, హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూల్చేయటానికి ప్రభుత్వం అంటే ఏమైనా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా?? 53 ఇళ్ళను కూల్చేశారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ అవాస్తవం. రోడ్డు వైడనింగ్ కోసం జనవరిలోనే మార్కింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ సభ జరిగింది మార్చి నెలలో. రోడ్డుకు మరోవైపు గతంలోనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేనట్లు ఉంది.

ఒక్క ఇల్లు కూడా పడగొట్ట లేదు…నేను సవాలు విసురుతున్నా. డ్రైన్ కట్టే క్రమంలో ఆక్రమణలను తొలగించారు. ఇక్కడే జరిగిందా?? ఎక్కడా జరగలేదా??. పవన్ కళ్యాణ్‌ను అంతమొందించటానికి 250 కోట్ల సుపారీ ఇచ్చారట… గుజరాత్‌కు చెందిన వాళ్ళకు 250 కోట్లు ఇవ్వటం ఎందుకు… దానిలో సగం డబ్బులు పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు ‌‌..తోకాడించుకుంటూ వస్తాడు. చంద్రబాబు పై ఓ రాయితో హత్య ప్రయత్నం అని డ్రామాలు ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ డైలాగులు చూస్తే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నం చేయకండి. పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్‌కు నా సలహా ఇది. పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాది. యువత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటం గ్రామంలో 50 లక్షలు ఇస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి అంటూ మంత్రి అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version