కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలు కల్పించిన తరువాత ఓట్లు అడగాలి : ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

-

కరీంనగర్-నిజామాబాద్-ఆధిలాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వేములవాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 12లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది. చాలా మందికి వెసులుబాటు లభించింది. 60 ఏళ్ల నుంచి కానిది మోడీకి దక్కింది. ఒక్క ఉద్యోగికి లక్ష రూపాయలు లాభం ఉందన్నారు.

60 సంవత్సరాల కాలంలో యువకులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 56వేలు అకౌంట్ లో వేసిన తరువాత ఓట్లు అడగాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలు కల్పించిన తరువాత ఓట్లు అడగాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఓటు అడగాలని 7500 కోట్లు ఫీజు రీయంబర్స్ ఇప్పించిన తరువాత కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు అడగాలన్నారు అంజిరెడ్డి. ఫీజు రియంబర్స్ ఇప్పిస్తేనే కాలేజీలు నడుస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా ఉన్న విద్యాసంస్థలో విద్యార్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కనీస వసతులు కూడా లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version