యనమల దుమ్మెత్తి పోయడం చూస్తే.. పిల్లి శాపాలు అనే సామెత గుర్తుకొస్తోంది – మంత్రి బుగ్గన

-

టిడిపి సీనియర్ నేత యనమలపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ పాలనపై యనమల దుమ్మెత్తి పోయడం చూస్తే.. పిల్లి శాపాలు అనే సామెత గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానించారు. “పిల్లి శాపాలకు ఉట్లు తెగవు” అనేది యనమల మాటలకు అక్షరాలా సరిపోతుందన్నారు. రాష్ట్రమంతటా రైతాంగం పచ్చగా ఉంటే యనమల ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో ఏపీలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని.. అది చూసి ఓర్వలేక యనమల రామకృష్ణుడు, ఇతర టిడిపి నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. శాపనార్ధాలు పెట్టడమే టిడిపి నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రి బుగ్గన నిప్పులు చెరిగారు. కొద్ది నెలల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారబోతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడేమో నైజీరియా, జింబాబ్వే అంటూ నాన్న యాది చేస్తున్నారని.. సానుకూల దృక్పథం అనేది వారి డిక్షనరీలోనే ఉన్నట్లుగా లేవని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version