పవన్‌ ఎప్పుడేం మాట్లాడతాడో అతడికే తెలియదు : మంత్రి దాడిశెట్టి రాజా

-

ఏపీ విపక్షనేత పవన్ కల్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు చేశారు. చంద్రబాబును వీలైనంత త్వరగా సీఎం చేయాలనే
తాపత్రయం తప్ప పవన్ కు మరొక ఉద్దేశం కనిపించడంలేదని విమర్శించారు మంత్రి దాడిశెట్టి రాజా. గతంలో చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు ఇదే మాదిరిగా హ్యాష్ ట్యాగ్ చేసుంటే పరిస్థితి ఇలా ఉండేదా? అని ప్రశ్నించారు మంత్రి దాడిశెట్టి రాజా. నాడు బాబు రోడ్ల నిధులను దారిమళ్లించినా పవన్ ఎందుకు అడగలేదు? అని నిలదీశారు మంత్రి దాడిశెట్టి రాజా. చంద్రబాబు రోడ్లు పట్టించుకోకపోయినా పవన్ నాడు ఏం మాట్లాడలేదని దాడిశెట్టి రాజా ఆరోపించారు. ప్రతి రోడ్డుకు 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జీవితకాలం ఉంటుందని, తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయిందని, ఆ రోజున రోడ్లు బాగు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని, అంతేకాదు, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరుపెట్టడం, తదితర పరిణామాలపైనా స్పందించారు మంత్రి దాడిశెట్టి రాజా.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరుపెట్టడాన్ని సమర్థించానని పవన్ తొలుత పేర్కొన్నాడని, కానీ ప్రభుత్వం తమ నిర్ణయం ప్రకటించగానే, కేవలం ఈ జిల్లాకు మాత్రమే పేరుపెట్టాలా? అంబేద్కర్ ను ఒక జిల్లాకే పరిమితం చేస్తారా? అని అన్నాడని ఆరోపించారు మంత్రి దాడిశెట్టి రాజా. అవన్నీ మర్చిపోయి, ఆ నిర్ణయాన్ని స్వాగతించింది తానేనని మళ్లీ పవనే అంటాడని, ఎప్పుడేం మాట్లాడతాడో అతడికే తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు మంత్రి దాడిశెట్టి రాజా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version