బీజేపీకి అధికార యావ త‌ప్ప ప్రజలపై ప్రేమ లేదు : ఎర్రబెల్లి

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నిన్న పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ పేరతో నిర్వహించి భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ సభలో బీజేపీ నేతలు ప్రసంగంతో పాటు ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. స‌భ‌లు పెట్టుకోవ‌డానికి ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌న్నారు. కానీ, స‌భ‌ల పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన దాడి అంతా ఇంతా కాద‌న్నారు మంత్రి ఎర్రబెల్లి.

ఈ దాడి మొత్తం తెలంగాణ ప్రజానీకంపై జ‌రిగిన‌దిగా భావిస్తున్నామ‌ని, పీఎం మోదీ కేసీఆర్ పేరు ఎత్తరు.. కానీ, ఆయ‌న భ‌జ‌న గ‌ణం అంతా క‌లిసి ప్రత్యక్షంగా సీఎం కేసీఆర్‌ పై దాడి చేసి తెలంగాణ ప్రజల మ‌నోభావాల‌ను దెబ్బతీశారి మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీకి అధికార యావ త‌ప్ప ప్రజలపై ప్రేమ లేద‌ని మ‌రోసారి తేలింద‌న్న మంత్రి ఎర్రబెల్లి.. అబ‌ద్ధాలు వ‌ల్లించ‌డం, మోసం చేయ‌డం, మ‌త విధ్వేషాలు రెచ్చగొట్టి దేశ భ‌క్తి సెంటిమెంట్లను పండించి ఓట్లు దండుకునే రాజ‌కీయాలు తెలంగాణ‌లో సాగ‌వ‌న్నారు. ఇక్కడి ప్రజలు బీజేపీ ఆటలు సాగనివ్వరని, బీజేపీకి త‌గిన బుద్ధి చెప్పే రోజులు వ‌స్తాయ‌ని ఉద్ఘాటించారు మంత్రి ఎర్రబెల్లి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version