జనసేన ను సైకో సేనగా అభివర్ణించిన మంత్రి జోగి రమేష్

-

వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టబోమని, వైసీపీ పార్టీ కోటలు బద్దలు కొడతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇవాళ ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం చేశారు పవన్‌ కళ్యాణ్‌. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటించారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించింది. వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు.

అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని పేర్కొన్నారు. జనసేన ను సైకోసేనగా అభివర్ణించారు మంత్రి జోగి రమేష్. ఈ సైకో గాళ్లు నెలకొకసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళుతుంటారని, ఈ సైకోలు రాత్రిపూట సచ్చరించే రౌడీలు, గుండాలు, పోరంబోకులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version