నారా లోకేష్ కళ్ళులేని కబోది – మంత్రి జోగి రమేష్

-

జగనన్న కాలనీలో పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడిన విషయం తెలిసిందే. జగన్ రెడ్డి తన కోసం ఎకరాల విస్తీర్ణంలో ఐదు ఇల్లు కట్టుకున్నాడని.. ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్ర ప్రజలకి మాత్రం మూడున్నర ఏళ్ల పాలనలో శంకుస్థానంలో ఐదు ఇల్లే కట్టాడని ఆరోపించారు.

ఇల్లు కట్టడం చేతకాదు కానీ కూలగొట్టమంటే రోజుకి లక్ష ఇళ్లయినా కూలగొట్టి గిన్నిస్ బుక్ ఎక్కేస్తాడు మన జెసిబి మోహన్ రెడ్డి అంటూ ట్విట్టర్ వేదికగా చురకలాంటించారు. లోకేష్ చేసిన ట్వీట్కు మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కి సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. మాటలు చెప్పడం తమకు రాదని.. దమ్ముంటే ప్రభుత్వం కట్టే జగనన్న కాలనీలకు రావాలని సవాల్ విసిరారు.

జగనన్న కాలనీలలో కట్టే ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందో చూపిస్తామన్నారు. నారా లోకేష్ పరమ శుంట అని మండిపడ్డారు. లోకేష్ కళ్ళులేని కబోది అన్నారు మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో ఇంకా తాము బ్రతికే ఉన్నామని చెప్పుకోవడానికి లోకేష్ ట్వీట్లు పెడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version