హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. నాలా రిటైనింగ్ వాల్ కు శంఖుస్థాపన

-

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్ కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. రూ. 68 కోట్ల రూపాయలతో కవాడి గూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టనుంది తెలంగాణ సర్కార్.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో వర్షాలు పడిన సమయంలో హుస్సేన్ సాగర్ పొంగి నల్లకుంట, అంబర్ పేట ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. శాశ్వతంగా నాలా సమస్యలు పరిష్కారం చేయాలని SNDP చేపట్టామని.. 12 కిలోమీటర్లు హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే వరద కాల్వ రిటైనింగ్ వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మంచినీటి సమస్య, రోడ్ల సమస్య పరిష్కారం చేసుకుంటున్నామని.. నాళాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version