నేడు కాలేజీ యాజమాన్యాలతో మంత్రి సబిత భేటీ

-

హైదరాబాద్ నర్సింగ్ శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్‌ అనే విద్యార్థి… టార్చర్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. దీంతో నేటి సాయంత్రం జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఇందుకోసం 14 ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను సమావేశానికి ఇంటర్ బోర్డు ఆహ్వానించింది. విద్యార్థుల సూసైడ్ ఘటనలు, కాలేజీల్లో పెరుగుతున్న ఒత్తిడిపై ముఖ్యంగా చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version