దేశం లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వన్నన్ని ఇల్లు జగన్ ఇచ్చారు : వెల్లంపల్లి

-

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వం లో ఆర్యవైశ్యులకు గుర్తింపులేదని అన్నారు. చంద్రబాబు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకున్నారని వెళ్ళంపల్లి ఆరోపించారు. చంద్రబాబు గత ఎన్నికల ముందు మాత్రమే కోర్పొరేషన్ ఏర్పాట చేశారని….ఆర్యవైశ్యులు రాజకీయంగా ముందుకు రావాలని అన్నారు.ముఖ్యమంత్రి జగన్ ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని వెళ్లంపల్లి వ్యాఖ్యానించారు. 31 లక్షల మందికి ఒకే సారి ఇళ్ల స్థలం, పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అంటూ ప్రశంసలు కురిపించారు. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇవ్వని ఇళ్ళు సీఎం జగన్ ఇచ్చారు అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. తెల్లకార్డు దారులందరికీ సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందిస్తున్నారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news