హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం

-

హైదరాబాద్, కాచిగూడ‌లోని తిలక్ నగర్‌లో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రమ్య అనే 15 ఏళ్ల మైనర్ బాలిక అదృశ్యమైంది. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిలక్ నగర్, ఫీవర్ హాస్పిటల్ మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది.

బాలిక కిడ్నాప్ కేసును కాచిగూడ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. పాపకు కొద్దిగా మతిస్థిమితం సరిగ్గా లేదు.. అయితే, తిలక్ నగర్ & కొరెంటి ఫీవర్ హాస్పిటల్ రూట్ లో మా పాప నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ చూశాము అని వారు తెలిపారు. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. మా పాప తప్పిపోయిందని కాచిగూడ పోలీసులకు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పుకొచ్చారు. మా పాప ఇంటికి క్షేమంగా తిరిగిరావాలని భగవంతూన్ని ప్రార్థిస్తున్నామని బాలిక రమ్య తల్లిదండ్రులు కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version