తెలంగాణలో మ‌రో దారుణం.. బాలికపై అత్యాచారం ఆపై ఉరి

-

దిశా హత్యాచారం ఘటనపై యావత్ దేశం భగ్గుమంటోంది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష వేయాలని ప్రజలంతా నిర‌శ‌న‌లు చేస్తున్నారు. దిశ‌కు జరిగిన దారుణం అందరిని షాక్ కు గురి చేసింది. ఆ షాక్ నుంచి ఇంకా ఎవరూ తేరుకోనేలేదు. కానీ… అచ్చం అలాంటి సంఘటనలు మాత్రం రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాల్ జిల్లా మల్డకల్ మండలం నేతివానిపల్లిలో ఓ బాలికను రేప్ చేసి ఆపై ఉరితీసి చంపేశారు. రాత్రి బాలికను పొలాల్లోకి రమ్మని ఆగంతకుడు ఫోన్ చేశాడు.

అయితే వాడి మాటల్ని అమాయకంగా నమ్మి వెళ్లిన బాలికను అక్కడే అత్యాచారం చేశారు. ఆపై అమ్మాయిని ఉరివేసి హతమార్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిందితుల్ని ఒక్కరోజులు పట్టుకోకపోతే… పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్రామ ప్రజలకు దొరికితే గనుక గద్వాల్ జిల్లాలో సోమనాద్రి సాక్షిగా నడి రోడ్డు మీద చంపేస్తామని పోలీసులకు సవాలు విసురుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version