మిషన్ భగీరథ నీళ్లు రాక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

-

మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. సంవత్సరం నుంచి తమకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రతాప్ నగర్లో వాసులు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదని, ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కాలనీవాసులు తమ నిరసన తెలిపారు. సంవత్సర కాలంగా తాగునీటికి గోస పడుతున్నామని..అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రతాప్ నగర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగు నీటి సమస్యను పరిష్కారం చూపాలని కాలనీవాసుల నిరసన చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version