విశాఖ డ్రగ్స్ కేసు భారీ కుంభకోణం: MLA బుచ్చయ్య

-

ఎన్నికలవేళ విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారం ఏపీ రాజకీయల్లో సంచలనంగా మారింది విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు ఈ క్రమంలో డ్రగ్స్ కేసు మీద టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది చిన్న వ్యవహారం కాదన్నారు భారీ కుంభకోణం అని సంచలన ఆరోపణలు చేశారు.

అధికార వైసిపి డ్రగ్స్ ని విక్రయించి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని చూస్తోందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ని సీఎం జగన్ నేరేంద్రప్రదేశ్ గా మార్చాలని అన్నారు రాష్ట్రంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ వస్తున్నప్పటికీ విదేశాల నుండి సమాచారం వస్తే కానీ ఇక్కడ అధికారులు మేలుకోవట్లేదని అన్నారు విశాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకి ఆటంకాలు సృష్టిస్తాయని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version