అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు: MLA మనోహర్ రెడ్డి

-

అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుల తో సమావేశాన్ని నిర్వహించి చెక్కులను పంపిణీ చేశారు.

ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలని మంజూరు చేస్తూ అన్ని వర్గాలకి న్యాయం చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంత్ ముదిరాజ్ భీమయ్య కలాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news