గ్రూపు-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

తెలంగాణ గ్రూపు 1 అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం గ్రూపు 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ నోటిఫికేషన్ కి అదనంగా మరో 60 పోస్టులను యాడ్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్ అనే చెప్పవచ్చు.   ఇటీవలే  తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

ఎక్కువగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై చర్చ నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు రద్దయిన తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా కేవలం 60 పోస్టులు మాత్రమే కలుపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. ఇప్పటికే ఆ పరీక్ష రెండు సార్లు వాయిదా పడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news