వైకాపా MLA: ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు ఎందుకు..?

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పార్టీ తీరు పై ఆ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సహకారం అందించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే గా ఏమీ చేయలేక పోయానని ప్రజలు తనని క్షమించాలని ఆమె అన్నారు.

చెరువుకి నీరు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తోంది. నీటి కోసం ఎన్నో సార్లు అధికారులకి చెప్పినా స్పందించ లేదని అన్నారు. సీఎం ఆఫీస్ కి వెళ్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆమె అన్నారు. సింగనమల నియోజకవర్గం యుద్ధం చేయాలా అని అన్నారు వరదలు వస్తే నీళ్లు ఇస్తారా అని అన్నారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా అంటూ ఆమె ప్రశ్నించారు. ఒక కులం ఒక నియోజకవర్గానికి మాత్రమే అన్ని ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news