అమరావతిలో మగాళ్ళకు దమ్ము లేదు, రోజా సంచలన వ్యాఖ్యలు…!

-

అమరావతి ఉద్యమం ఏమో గాని అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఒకరు పెయిడ్ ఆర్టిస్ట్ లు అని మరొకరు, రైతులు కార్పొరేట్లు అంటూ మాట్లాడుతూ అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యమం తప్పని అన్నా పర్లేదు గాని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చికాకుగా మారింది. తాజాగా అమరావతిలో జరుగుతున్న ఉద్యమంపై రోజా మాట్లాడుతూ,

కొందరు రాజకీయ నేతలు ఆడవాళ్లను ముందుపెట్టి అమరావతిలో ఉద్యమం చేస్తున్నారని, వాళ్లు మాత్రం ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారని, ఆడవారిని రోడ్ల మీదకు వదలి పోలీసులు కొట్టారంటూ ఏడుస్తున్నారని.. అమరావతిలో మగవాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. మీరు చేసిన తప్పులకు ఆడవారిని ఎందుకు బలి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

అక్కడి మహిళలంతా స్వార్థం కోసమే ఉద్యమం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కూకట్ పల్లి నుంచి ఇక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని, లోకేష్ స్నేహితుడైన ఓ డైరెక్టర్ మన వాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్లి బాగా ధర్నా చేస్తున్నారని ట్వీట్ చేసారని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజధాని ఉద్యమంపై పలువురు వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version