అయ్యన్నపాత్రుడికి వైసీపీ ఎమ్యెల్యే వార్నింగ్.. టచ్ చేస్తే.. చెరువులో పాతేస్తా !

-

విశాఖ : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గణేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా ఇంటికి వచ్చి నన్ను టచ్ చేసి చూడు…ఆక్కడే పాతేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల మీద, సీఏం మీద, మంత్రుల మీద లేనిపోని విమర్శలు చేయడం వల్లే అయ్యన్న పాత్రుడి పై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజర్ల కేసులో నోటీసు ఇచ్చేందుకు పోలీసులు ఇంటికి వస్తే దాక్కున్న నువ్వు పెద్ద పిరికివాడివి.. అంటూ ఫైర్ అయ్యారు.

మా ఇంటి కొచ్చి రేకుల షెడ్డు నేలమట్టం చేస్తామనంటున్నారు… ఒకసారి దమ్ముంటే రా… మా ఇంటి పక్కనే ఉన్న చెరువులో పాతేస్తా…అంటూ హెచ్చరించారు. లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చి వందల కోట్లు సంపాదించింది మీరు.. అది ఇప్పుడు బాక్సైట్ ఎలా అవుతుంది ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంజాయి నర్సీపట్నంలో విస్తరించింది టిడిపి ప్రభుత్వ హయాంలోనేనని మండిపడ్డారు. రంగురాళ్ల తవ్వకాల్లో వందల కోట్లు సంపాదించింది టిడిపి నేతలు అని ఆరోపణలు చేశారు. ఆ వ్యాపారుల వద్ద నుంచే నీవు కార్యక్రమాల పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్నావని అయ్యన్న పాత్రుడిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే గణేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version