కాల్పుల కలకలం.. ఏకంగా ఎమ్మెల్సీ ఇంట్లోకి చొరబడి..!

-

అంతా సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది వేడుకలకు హాజరైన ఒక వ్యక్తి ఏకంగా తుపాకీతో కాల్పులు జరపడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఇంట్లో కాల్పులు జరగడం స్థానికంగా సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది.

dead body

లఖనవు ప్రాంతంలో సమాజ్వాది పార్టీకి చెందిన షాజహాన్పూర్ ఎమ్మెల్సీ అమిత్ యాదవ్ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే రాకేష్ అనే వ్యక్తి కూడా వేడుకలకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి తన వెంట తెచ్చుకున్న తుపాకీని మరో వ్యక్తికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అనుకోకుండా రాకేష్ ముఖంపై కాల్చాడు. కాగా సదరు వ్యక్తి మద్యం మత్తులో ఇలా కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రాకేష్ ని ఆస్పత్రికి తరలించినప్పటికే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news