కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కరోనా పాజిటివ్‌

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నాయకులు జీవన్‌ రెడ్డి కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కరోనా లక్షణాలతో… ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌ రావడంతో …హోం ఐసోలేషన్‌ లోకి వెళ్లారు జీవన్‌ రెడ్డి. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని జీవన్‌ రెడ్డి సూచించారు.

అందరూ జాగ్రత్తగా ఉండాలని.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యలో ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని పేర్కొన్నారు జీవన్‌ రెడ్డి. కాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 465 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,31,683 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 04 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3729 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 10,316 గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,17,638 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version