క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు…తెలంగాణాలో KCR కు ఎదురులేదు !

-

తెలంగాణాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలని అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఇక తాజాగా ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేరుకున్న 50 సెంచరీ ల రికార్డును సైతం BRS తమకు అనుకూలంగా వాడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ పేజ్ లో విరాట్ కోహ్లీని అభినందిస్తూ పోస్ట్ చేసింది. క్రికెట్ లో కోహ్లీ కి ఎప్పుడూ తిరుగులేదు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వానికి ఎదురులేదంటూ ఒక పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కవిత. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి పోస్టర్లు ఎన్ని పోస్ట్ చేసినా ప్రజలు ఆశీర్వాదం లేకుంటే కష్టమే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

https://x.com/RaoKavitha/status/1724778227619758160?s=20

మరి ఈ సారి జరగనున్న ఎన్నికలలో మరోసారి ప్రజలు కేసీఆర్ ను గెలిపిస్తారా లేదా ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి అవకాశం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version