ప్లాస్మా సంజీవనితో సమానం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

-

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్‌.కీరవాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి పేర్కొన్నారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని తెలిపారు.

mm keeravani

ప్లాస్మా దాతలందరూ ప్రాణదాతలని కొనియాడారు. ఈ విషయంలో అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్న ఆయన.. మా కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్లాస్మా దానంపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం చాలా కష్ట పడుతుంది. సినీ ప్రపంచంలో ఉండే ప్రముఖులు చెబితే ప్రజలలో చలనం వస్తుంది అని ఎదో కొంత మేర ఆశ. ఇప్పటికే కరోనా మహమ్మారి వలన రక్త దానం చెయ్యడానికి కూడా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version