BREAKING : హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైలుకు ప్రమాదం

-

హైదరాబాద్‌ మహ నగరంలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. అయితే.. ఈ ప్రయాణ సమయంలో రైలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఆగి పోయింది. దీంతో రైలు లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు.. భయాందోళనతో పరుగులు తీశారు ప్రయాణికులు.

ప్రయాణ సమయంలో రైలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సమస్యకు కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. బేగంపేట్, నెక్లెస్ రోడ్ స్టేషన్ల మధ్య పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉంటే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో లోకల్ ట్రైన్ లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version